
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం భీభత్సమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Uttar Pradesh: కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం
22 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :