हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest News: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Anusha
Latest News: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

కేరళ రాష్ట్రంలోని శబరిమల (Sabarimala) కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు బస్సులు, వాహనాల ద్వారా శబరిమల యాత్రకు వెళ్తున్నారు. అయితే ఈ యాత్రలో ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also: BC reservations: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరుతూ ధర్నా

Sabarimala: Road accident near Pamba.. AP Ayyappa Swamula's bus overturns
Sabarimala: Road accident near Pamba.. AP Ayyappa Swamula’s bus overturns

గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. పథనంతిట్ట జిల్లా వడస్సేరిక్కార ప్రాంతంలో ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. ఏపీ చిలకలూరిపేట నుంచి శబరిమలకు బయలుదేరిన మౌనిక టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన చెందిన బస్సు అది.

వడస్సేరిక్కార వద్ద ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పింది బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ యాత్రీకుడి కాలు పూర్తిగా తెగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది అయ్యప్పస్వాములు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870