Nalgonda Crime: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. మద్యానికి బానిసైన కొడుకు కిరాతకానికి కన్నతండ్రి బలయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడే అలవాటు ఉన్న బాలకృష్ణ అనే యువకుడు, గురువారం రాత్రి కూడా ఫుల్గా తాగి వచ్చి ఇంట్లో రభస చేశాడు.
Read Also: Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

అక్కడికక్కడే మృతి
తండ్రి బుర్రే సత్తయ్య (60) తన కొడుకును వారించే ప్రయత్నం చేయగా, ఆగ్రహానికి గురైన బాలకృష్ణ తండ్రిని రోడ్డుపైకి బలంగా నెట్టివేశాడు. ఈ క్రమంలో సత్తయ్య తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి(Nakrekal Hospital)కి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: