Mulugu Road Accident: రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Read Time:  1 min
Mulugu Road Accident
Mulugu Road Accident
FONT SIZE
GET APP

Mulugu Road Accident: ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా చూసేందుకు వీరభద్రరాజు (52) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరిన సమయంలో ఎదురుగా వచ్చిన క్రేన్ లారీ అకస్మాత్తుగా వారి వాహనాన్ని ఢీకొట్టింది.

Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

Mulugu Road Accident: Road accident while Rajasab was going to the cinema.. one person died
Mulugu Road Accident: Road accident while Rajasab was going to the cinema.. one person died

ఈ ప్రమాదం(Fatal Accident)లో వీరభద్రరాజు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్ర గాయాలకు గురికావడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సినిమా సందడి కోసం వెళ్లిన కుటుంబంపై ఒక్కసారిగా విషాదం ముసురుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి, క్రేన్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.