ప్రాణాపాయ స్థితిలో మణిపూర్ ఎమ్మెల్యే: డ్రగ్ ముఠాల దాడిపై షాకింగ్ వెల్లడి
మణిపూర్ ఎమ్మెల్యే నూరుల్ హసన్పై జరిగిన దాడి మరోసారి డ్రగ్ మాఫియాల దుష్టబుద్ధిని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన హసన్ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 100 మంది డ్రగ్ స్మగ్లర్లు ముందస్తు ప్రణాళికతో తనపై దాడికి దిగారు. ఫ్యామిలీ డిన్నర్ తర్వాత ఇంటికి తిరిగివస్తున్న సమయంలో మెరుపుదాడికి పాల్పడిన ముఠా, ఆయనను హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. గొంతు కోయాలని ప్రయత్నించడమే కాక, తుపాకులతో కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దాడి తాలూకు వివరాలు భయంకరంగా ఉండటంతో, రాష్ట్రంలో డ్రగ్ మాఫియా బలంగా నెలకొన్నట్లు స్పష్టమవుతోంది.
హత్యాయత్నానికి తెగబడిన ముఠా
ఈ నెల 5న సాయంత్రం, మణిపూర్ ఎమ్మెల్యే నూరుల్ హసన్ తన సోదరి ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా క్షేత్రిగావ్ హైస్కూల్ సమీపంలో దాడి జరిగింది. మహ్మద్ అజ్మల్ నేతృత్వంలో ఉన్న డ్రగ్ స్మగ్లర్ల ముఠా ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది. ముందుగా ఆయన చేయి పట్టుకుని రోడ్డుపైకి లాగి పడేసారు. అనంతరం గొంతు కోయడానికి ప్రయత్నించారని హసన్ పేర్కొన్నారు. ఈ ఘటన పూర్తిగా పక్కా ప్రణాళికతో నిర్వహించబడిందని, స్ట్రీట్ లైట్లు కావాలనే ఆఫ్ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారని, తర్వాత ముఠా రాళ్లు విసురుతూ తుపాకులతో కాల్పులు జరిపిందని వివరించారు.
కాల్పులు, రాళ్ల దాడి – క్షతగాత్రుల స్థితి
ఈ దాడిలో హసన్ ఛాతీపై తీవ్ర గాయాలు అయినట్టు తెలిపారు. ముఠా తుపాకులతో కాల్పులు జరపడంతో పాటు రాళ్లతో తీవ్రంగా దాడి చేసిందని వెల్లడించారు. ఒక వ్యక్తి తుపాకీతో తన నుదుటిపై గురి పెట్టిన దృశ్యాన్ని గుర్తు చేసుకున్నారు. స్ట్రీట్ లైట్లను కావాలనే ఆఫ్ చేయడం ద్వారా దాడి చేయడానికి సౌకర్యంగా ఉండేలా చేశారు. ఈ మొత్తం ఘటన పూర్తిగా పూర్వ ప్రణాళికతో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించకపోతే, తన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది అంటూ హసన్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియా రెచ్చిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతా సిబ్బంది ధైర్య సాహసంతో ప్రాణాలు దక్కిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే బ్లాంక్ రౌండ్లు కాల్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని, తమ బాస్ను సురక్షిత ప్రదేశానికి తరలించారని ఆయన తెలిపారు. అయినప్పటికీ ముఠా వదలకుండా దాడులను కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు.
పోలీసుల నిర్లక్ష్యం పట్ల ఆవేదన
ఈ ఘటనపై ఆయన ఇప్పటికే పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని, నిందితుల్లో చాలా మంది తీవ్ర క్రిమినల్ కేసుల్లో బెయిలుపై బయట ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోందని హసన్ వాపోయారు. ‘‘ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు, ఇది నన్ను అణచివేయాలనే కుట్ర. మణిపూర్లో డ్రగ్ మాఫియా ఎలా రెచ్చిపోయిందో ఈ ఘటన చాటుతోంది’’ అని ఆయన అన్నారు.
READ ALSO: Chattisgaḍh: చత్తీస్గఢ్లో దారుణం సొంత మామే బాలికపై అఘాయిత్యం