Kukatpally: హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని శ్రీ రామకృష్ణ నగర్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఇంట్లో మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఉంచుకుని ప్రార్థనలు చేస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also:AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్

అపార్ట్మెంట్ వాసులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం పోలీసులు ఆ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. ‘ఏసు కాపాడతాడు, ప్రాణం పోస్తాడు’ అంటూ మృతదేహం వద్ద ప్రార్థనలు చేస్తున్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం, ఏసురత్నం అనే వ్యక్తి సుమారు 40 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు. ఆయన ఏఎస్ఐగా పని చేసి పదవీ విరమణ పొందిన అనంతరం మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కుమార్తెలు సునీత, శైలజ, కుమారుడు జయరాజు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: