Kamareddy crime: కామారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు పట్టణంలోని పెద్ద చెరువులో శవాలై తేలడం విషాదానికి గురిచేసింది. మరణించిన వారంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఒక ఆటో డ్రైవర్ పిల్లలైన సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం తండ్రి వారిని ఆటోలో తీసుకెళ్లి దుకాణం వద్ద వదిలేసినట్లు సమాచారం.
Read Also:AP crime: రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

తండ్రిపైనే పోలీసుల అనుమానం
సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు చివరకు పట్టణంలోని పెద్ద చెరువులో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, ఈ ఘటనపై పిల్లల తండ్రి చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అతడిని అనుమానిస్తున్నారు. ఉదయం పిల్లలను షాపు వద్ద దించి కిరాయికి వెళ్లానని, వారు ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఉంటారని అతడు చెబుతున్నాడు. ఈ సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కామారెడ్డిలో గత రెండు రోజులుగా చిన్నారులు వరుసగా అదృశ్యం కావడం కలవరపెడుతోంది. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9) అనే ఇద్దరు బాలురు కూడా అదృశ్యమయ్యారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ అదృశ్యాలు, మరణాల నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఈ మరణాల వెనుక అసలు మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: