Bangalore Crime: బెంగళూరులోని వర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తనతో కలిసి సహజీవనం చేస్తున్న రంజిత (23) అనే యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడు అయ్యప్ప కేబుల్ వైర్తో రంజిత గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Also: Yadadri Bhuvanagiri Crime: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

కుల విభేదాలు.. తరచూ గొడవలు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కులపరమైన విభేదాలు, తరచూ గొడవలే ఈ హత్యకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: