బెంగళూరు(Bangalore)ను షాక్కు గురి చేసిన డాక్టర్ కృతికా రెడ్డి మరణం కేసులో కొత్త వివరాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 21న కృతికా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందగా, మొదట ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అనారోగ్యంతో మరణించిందని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, వైద్య పరీక్షల్లో ఆమె మత్తుమందు అధిక మోతాదు వల్ల చనిపోయినట్లు తేలడంతో కేసు మలుపు తిరిగింది.
Read Also: Karthika Pournami: వ్రతం, దీపారాధనకు శుభ సమయాలు ప్రకటించిన పండితులు
పోలీసులు దీన్ని హత్యగా భావించి విచారణ ప్రారంభించారు. దాదాపు ఆరు నెలల లోతైన దర్యాప్తు అనంతరం, మహేంద్ర రెడ్డే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 15న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హత్య వెనుక ప్రేమ వ్యవహారం
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కృతిక అనారోగ్యంతో ఉన్న వేళ, మహేంద్ర ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు నటించాడు. అయితే ఆమెకు అధిక మోతాదులో మత్తుమందు ఇంజెక్ట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

తర్వాత, తన ప్రియురాలికి “నీ కోసం నా భార్యను చంపేశాను” అంటూ సందేశం పంపించాడు. సాధారణ మెసేజింగ్ యాప్లు కాకుండా, ట్రేస్ చేయడం కష్టమయ్యే డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా ఆ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టిన పోలీసులు, మహేంద్ర ప్రియురాలిని కూడా విచారించి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలిపారు. అయితే ఆమె వివరాలను గోప్యంగా ఉంచారు.
ఈ కేసుతో మరోసారి ప్రేమ వ్యవహారం పేరుతో జరిగే హత్యలు, వాటి వెనుక దాగి ఉన్న దారుణాలపై చర్చ మొదలైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: