
Adulterated Food Hyderabad: హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం హబీబ్నగర్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక తయారీ కేంద్రాన్ని ముట్టడించిన అధికారులు, దాదాపు 1,090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫరూక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Hyderabad Gas Shortage: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం..హైదరాబాద్లో దోశ, పూరి, వడ బంద్!

విచారణలో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు: నిందితుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను సహజ పద్ధతిలో కాకుండా, అత్యంత ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్, సింథటిక్ రంగులు మరియు గమ్ పౌడర్ను కలిపి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రసాయనాలు మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అంతేకాకుండా, నిందితుడి వద్ద ఉన్న FSSAI (ఆహార భద్రత) లైసెన్స్ 2018లోనే గడువు ముగిసినట్లు అధికారులు కనుగొన్నారు. కాలం చెల్లిన అనుమతులతో ఈ కల్తీ పేస్ట్ను నగరంలోని పలు హోటళ్లు మరియు కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: