బాలీవుడ్ వర్గాల్లో తాజాగా కలకలం రేపుతున్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిలకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు (Threat) వచ్చినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు వారి సిబ్బందిని కూడా చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.ఈ బెదిరింపులకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Actress Rajisha Vijayan: ఎనిమిదేళ్లుగా వాట్సాప్ వాడటం లేదు

అభిమానులు ఆందోళన
ఇటీవలే దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు రణవీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ క్రమంలో రణవీర్ సింగ్ కు బెదిరింపులు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: