పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
Crime: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పసిబిడ్డపై అత్యాచారానికి (Crime) పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావంతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఆ చిన్నారి కొట్టుమిట్టాడుతున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కుర్వ కుర్మయకు (Kurva Kurmaya) ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్ చదువుతుండగా, 5వ తరగతి చదువుతున్న చిన్నకూతురి(10)కి ఇటీవల కుక్కకరిచింది. దీంతో ఆ బాలిక ఇంటికి వచ్చింది. ఒంటరిగా ఉండడంతో అత్యాచారం (Crime) కాగా ఈనెల 25వ తేదీన బాలిక తల్లి కూలీపనులకు వెళ్లగా, మేకలను మేపేందుకు తండ్రి వెళ్లాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నకూతురు చదువుతుండగా, మద్యం మత్తులో ఉన్న కుర్వ కుర్మయ్య ఇంటికి వచ్చి, కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా నన్ను ఏమీ చేయొద్దు’ అని ఎంత వేడుకున్నా కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు రక్తస్రావంలో ఉన్న బాలికను కాపాడారు. ఆస్పత్రికి తరలించిన తల్లి కూలీపనుల నుంచి ఇంటికి తిరిగివచ్చిన తల్లి కూతురి పరిస్థితిని చూసి, చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. బాలిక పరిస్థితి విషమించడంతో మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు మహబూబ్నగర్ (Mahbubnagar) జనరల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాలిక ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆదివారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు, పరారీలో ఉన్న బాలిక తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఎవరు?
బాలిక తండ్రే అయిన కుర్వ కుర్మయ్య మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతున్నది?
బాలిక మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Uttar Pradesh: అనుమానంతో కాబోయే భార్యను హతమార్చిన వరుడు