తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం లేఖలను అమలు చేయాలని సూచించినా, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శించారు. తెలంగాణ భక్తులకు కూడా సమాన హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతి మేరకు, ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని నిర్ణయించినా, ఇంకా కార్యరూపం దాల్చలేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

Advertisements
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!


టీటీడీ లెక్కలు – ఒత్తిడిపై వాదనలు
ప్రస్తుతం 75 వేల మంది భక్తులు రోజూ శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. వీటిలో 7500 టికెట్లు వీఐపీలకు కేటాయిస్తుండగా, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు 2000 టికెట్లు కేటాయిస్తున్నారు. తెలంగాణ నేతల లేఖలను పరిగణలోకి తీసుకుంటే రోజుకు అదనంగా 1100 టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పుదోవ పట్టించేలా టీటీడీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వకపోతే, స్వయంగా తిరుమల వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు.

Related Posts
డిప్రెషన్‌తో కేపీ చౌదరి ఆత్మహత్య : పోలీసులు
KP Chowdary

తెలుగు సినీ నిర్మాత కెపి చౌదరి తన సూసైడ్ నోట్‌లో డిప్రెషన్ కారణంగానే తాను ఈ విపరీతమైన చర్య తీసుకున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాకూడదని Read more

హైదరాబాద్లో ఏపీ గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
group 2 candidate

ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద పెద్ద ఎత్తున సమావేశమైన అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తూ హైదరాబాద్‌లో Read more

నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు
CM Chandrababu will visit Nellore today

స్వచ్చ ఆంధ్ర–స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో Read more

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత
BRS MLC kavitha

తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం Read more

×