हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

Anusha
వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి, అనంతరం ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై న్యాయపరమైన పరిణామాలు మలుపు తిరుగుతున్నాయి. ఈ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు భద్రత అంశాలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను గుంటూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ రోజు విచారించింది.ఈ పిటిషన్లపై న్యాయవాదుల వాదనలు కొనసాగాయి. వాదనలు పూర్తయిన తర్వాత, కోర్టు తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది. వంశీకి జైల్లో మంచం ఏర్పాటు చేయడం, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అనుమతి కల్పించాలనే విషయాలపై కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వంశీని సాధారణ ఖైదీలతో కాకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచడంపై న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై జైలు అధికారులు వివరణ ఇచ్చారు. గుంటూరు జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, వంశీ భద్రత కారణంగానే ప్రత్యేక సెల్‌లో ఉంచామని తెలిపారు. జైలులో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని. వంశీకి భద్రతా పరమైన సమస్యలొస్తాయనే ఉద్దేశంతోనే ఆయనను ప్రత్యేక సెల్‌లో ఉంచామని తెలిపారు.

 వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

వల్లభనేని వంశీ తన ఆరోగ్య పరిస్థితిని ఆందోళనకరంగా పేర్కొంటూ బెడ్ ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి తినడానికి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. వంశీ తరఫున న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని. రిమాండ్ సమయంలో కూడా సరైన వైద్యం అందించాలనే కోణంలో ఈ పిటిషన్లు దాఖలైనట్లు తెలిపారు.

బెయిల్ పిటిషన్‌

వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేయడానికి కారణాలు సుస్పష్టంగా లేవని, ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఎక్కడున్నానో ట్రాక్ చేసి నన్ను అరెస్టు చేశారు. దర్యాఫ్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కస్టడీ ఎందుకు?’ అంటూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులను అడిగారు.

వంశీ అరెస్టు పట్ల వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ వేధింపుల కోణంలో ఈ కేసు నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, టీడీపీ మాత్రం న్యాయ పరంగా అన్ని రకాలుగా ముందుకెళ్తామని స్పష్టం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870