AndhraPradesh:కలెక్టర్ల సమావేశంలో తల్లికి వందనంపై కీలక ప్రకటన!

AndhraPradesh:కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల సమావేశం ఈ రోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.అధికారులు ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలని, దర్పం ప్రదర్శించకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాలనను మెరుగుపరచాలని సూచించారు.

చంద్రబాబు వ్యాఖ్యలు

ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు లేకుంటే పేదరిక నిర్మూలన సాధ్యపడదని, అందుకే సంక్షేమాన్ని అభివృద్ధితో కలిపి అమలు చేస్తామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ పాలనలో పింఛను రూ.400 నుంచి రూ.4000 వరకు పెంచామని, ఇది దేశంలో ఎక్కడా లేదని వెల్లడించారు.204 అన్న క్యాంటిన్లు ప్రారంభించి పేదలకు అన్నదానం అందించామని తెలిపారు.దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.

అడ్మినిస్ట్రేషన్‌లో కీలక మార్పులు

చెత్త పన్ను రద్దు చేసి ప్రజల భారం తగ్గించామని అన్నారు.ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్ సి ప్రకటన చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.డిఎస్ సి నియామకాలను పకడ్బంధిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు.ఎబిసిడిఈ విధానం అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

ANI 20241210171438

ఇతర పథకాలు

బీసీల ఆర్థికాభివృద్ధికి గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు.చేనేతలకు జీఎస్టీ రద్దు చేసి వారికి మేలు చేశామని చెప్పారు.సంక్షేమ పథకాలు బిచ్చగాలకు దానం చేసినట్లు కాదని, చివరి లబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరగాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.

రాజధాని నిర్మాణం

అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.విశాఖ లేదా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే, అదే తరహాలో ల్యాండ్ పూలింగ్ మోడల్ అనుసరించాలన్నారు.జాతీయ రహదారుల పనులకు రూ. 55,000 కోట్లు, రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ. 75,000 కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు.ఇవి కేంద్ర ప్రాజెక్టులు అని, రాష్ట్రానికి సంబంధం లేదని భావించవద్దని కలెక్టర్లకు స్పష్టంగా చెప్పారు.కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పరిపాలనా విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Related Posts
పవన్ కల్యాణ్ తో దిల్ రాజు భేటీ
cr 20241230tn6772510f3f955

సినిమారంగం, రాజకీయాలు ఇటీవల కాలంలో వేడిఎక్కిస్తున్న తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవడంతో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. Read more

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
Exhibition shops gutted in

అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ Read more

చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం – అంబటి
ambati polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి చంద్రబాబు నాయుడి అవగాహనారాహిత్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ తీసుకున్న Read more

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *