భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ (Kanthara Chapter 1) రికార్డుల పరంపరను సృష్టిస్తోంది. విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి సంచలనం రేపింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) మళ్లీ ఒకసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ఏమిటో రుజువు చేశారు.
Read Also: Karthi: చిరంజీవి సినిమాలో కార్తీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ రూ.807 కోట్లు వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘సైయారా’ రూ.600 కోట్ల వద్ద ఆగిపోయింది. భారీ హైప్ ఉన్న ‘కూలీ’ కూడా ఆ రికార్డును దాటలేకపోయింది. అయితే రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ (Kanthara Chapter 1) మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేసి, ఈ రికార్డును చెరిపేసింది.

ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్గా కాంతార: చాప్టర్-1
లెక్కల ప్రకారం, ఈ చిత్రం 22వ రోజుకే రూ.818 కోట్ల వరల్డ్వైడ్ కలెక్షన్ సాధించింది. దీంతో ‘కాంతార: చాప్టర్-1’ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అయితే వసూళ్లు ఇక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మొదట వెయ్యి కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమా ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.
థియేటర్స్లో రచ్చ లేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasant) హీరోయిన్గా నటించగా జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ (Hombale Films) ప్రొడ్యూస్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: