
Vishal-Rajendra Prasad: లెజెండరీ నటుడు ఎంజీఆర్ (MGR) గురించి గతంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై రాజేంద్ర ప్రసాద్ తాజాగా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేయగా, దానిపై హీరో విశాల్ సానుకూలంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ మా అభ్యర్థనను మన్నించి వెంటనే స్పందించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని విశాల్ ఒక వీడియో ద్వారా పేర్కొన్నారు.
Read Also: Ajith kumar : తమిళ స్టార్ హీరో అజిత్కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి
సీనియర్లను గౌరవించడమే మా బాధ్యత
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. “ఎంజీఆర్ గారి గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీ వ్యాఖ్యల వల్ల చాలా మంది సీనియర్ నటులు, అభిమానులు బాధపడ్డారు. అందుకే మేము వెంటనే స్పందించాలని కోరాం. మీరు మా మాటను గౌరవించి పెద్ద మనసుతో క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో మీలాంటి సీనియర్ నటుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా మేము ఇలాగే గళం విప్పుతాం” అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: