ప్రముఖ బాలీవుడ్ (Bollywood) గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీ పై లైంగిక దాడి కేసు నమోదైంది. ముంబైకి చెందిన ఓ గాయని ఇచ్చిన ఫిర్యాదు(Sachin Sanghvi) మేరకు విలే పార్లే పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, కెరీర్లో సహాయం చేస్తానని చెప్పి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు, సచిన్ సంఘ్వీకి గతేడాది సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూలై వరకు తామిద్దరూ సంబంధంలో ఉన్నామని, ఈ సమయంలోనే సచిన్ తనను తీవ్రంగా వేధించాడని ఆమె పేర్కొన్నారు.
Read also: భారత్ AI వ్యవసాయ టెక్నాలజీ ఇప్పుడు ఇతర దేశాలు పరీక్షిస్తున్నాయి

న్యాయవాదుల వాదనలు, కేసు విచారణ
తాను పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సచిన్(Sachin Sanghvi) తనను దూరం పెట్టడం ప్రారంభించాడని, తమ బంధం గురించి బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, సచిన్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించాడని కూడా ఫిర్యాదులో తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కారణంగా ఈ ఏడాది ఆగస్టులో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించారు. ఈ ఆరోపణలపై సచిన్ సంఘ్వీ తరఫు న్యాయవాది ఆదిత్య మిథే స్పందించారు. నా క్లయింట్పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ కేసులో ఎలాంటి నిజం లేదు. సచిన్ను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. అన్ని ఆరోపణలను మేము కోర్టులో సమర్థవంతంగా తిప్పికొడతాం అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు, బాధితురాలి తరఫు న్యాయవాది మాట్లాడుతూ, మా క్లయింట్కు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిందితుడు ఎంతటి పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: