‘పుష్ప 2’ తొక్కిసలాట (Stampede) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. పుష్ప -2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద గత ఏడాది డిసెంబర్లో తొక్కిసలాట (Stampede) ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేసింది.
Read Also: Volume 2 : స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2, మీరు మిస్ చేసిన ఈస్టర్ ఎగ్స్ ఇవే!

ఏ1గా సంధ్య థియేటర్
23మంది నిందితులను చార్జ్షీట్లో పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్దారించారు. దీంతో ఛార్జ్షీట్లో ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యంను చేర్చగా.. ఏ11గా హీరో అల్లు అర్జున్ పేరును చేర్చారు. ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్లును, నలుగురు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు తమ చార్జ్షీట్లో చేర్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: