हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Anusha
మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కుతున్న చిత్రం SSMB29. టాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారిన ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ కెరీర్‌లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం, రాజమౌళి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశా రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా గురించి ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

ప్రవతి పరిదా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మల్కాన్‌గిరి ప్రాంతంలో పుష్ప-2 షూటింగ్ జరిగినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడు SSMB29 మూవీ కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు.అంతేకాదు, ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు అంతర్జాతీయ నటీమణి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు మూవీ యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ సినిమా ఒడిశాలో చిత్రీకరించడం ద్వారా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహం లభిస్తుందని, ఒడిశా గమ్యస్థానంగా మారుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అదనంగా, అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తూ, షూటింగ్స్‌కు మద్దతుగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

సీక్రెట్‌గా షూటింగ్

సాధారణంగా రాజమౌళి సినిమాలు అత్యంత రహస్యంగా చిత్రీకరించబడతాయి. సెట్స్‌లో మొబైల్ ఫోన్లు అనుమతించరు, ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రాకముందే బయటపడిపోయింది.ఇటీవల మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎయిర్‌పోర్టులో కలిసిన ఫోటోలు వైరల్ కాగా, తాజాగా డిప్యూటీ సీఎం ట్వీట్‌లోనూ వారి పేర్లు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది.

వీడియో లీక్

ఇదే సమయంలో, ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా మహేశ్ బాబు ఒక వీడియో లీక్ అవ్వడం మరో సంచలనంగా మారింది. ఈ వీడియోలో మహేశ్ భిన్నమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

చిత్రీకరణ కంప్లీట్

ఈ సినిమా కొంతమేర చిత్రీకరణ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, యూనిట్ ఒడిశాకు వెళ్ళింది.రాజమౌళి సినిమాల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్‌ వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. కానీ, ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు.

జక్కన్న ప్లాన్

రాజమౌళి సినిమాల విషయంలో భద్రత అత్యంత కఠినంగా ఉండటం సాధారణమే. బాహుబలి నుంచి RRR వరకు అన్ని సినిమాలకు సంబంధించి, అతను ఎలాంటి లీకులూ జరగకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం అధికారిక ప్రకటన రాకముందే కాస్టింగ్ డిటైల్స్ బయటకు రావడం, మహేశ్ బాబు వీడియో లీక్ అవ్వడం కొత్త చర్చకు దారితీసింది.ఇకపై మరింత జాగ్రత్తగా రాజమౌళి లీకులు కట్టడి చేస్తారా? లేక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయా? అనేది చూడాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870