తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్బాస్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, తొమ్మిదో సీజన్తో మరింత వైవిధ్యంగా, వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
మళ్లీ హోస్ట్ గా నాగార్జున – ట్యాగ్లైన్తో
ఇప్పటికే పలు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున (Nagarjuna) మరోసారి హోస్ట్గా రాబోతున్నాడు. ఈ సారి షోకు “డబుల్ హౌస్.. డబుల్ డోస్” అనే ట్యాగ్లైన్ను ప్రకటించారు. ఇది షోలో వచ్చే మార్పులకు, కొత్తదనానికి సూచనగా నిలుస్తోంది.
ఫార్మాట్లో భారీ మార్పులు – పాత సిలబస్ కాదన్న నాగార్జున
తాజాగా విడుదలైన ప్రోమోలో, నాగార్జున (Nagarjuna) మరియు హాస్యనటుడు వెన్నెల కిశోర్ (Vennela Kishore) మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. “పాత సిలబస్తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?” అనే డైలాగ్ ద్వారా ఈసారి షోలో కొత్త కంటెంట్, కొత్త ఫార్మాట్ ఉండబోతున్నదని స్పష్టమవుతోంది.
‘డబుల్ హౌస్’ కాన్సెప్ట్ – రెట్టింపు ఉత్కంఠకు బీజం
ఈ సీజన్లో “డబుల్ హౌస్” అనే నూతన కాన్సెప్ట్ (New concept) ను పరిచయం చేయనున్నారు. ఇదేంటన్నది ప్రస్తుతం గోప్యంగానే ఉంచినా, ఇది షోలో ఉత్కంఠను రెట్టింపు చేస్తుందన్నది మాత్రం ఖాయం. రెండు ఇండ్ల మధ్య జరిగే గేమ్లు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి.
సెలబ్రిటీలు మాత్రమే కాదు – సామాన్యులకూ అవకాశం!
గత సీజన్ల కంటే భిన్నంగా, ఈసారి షోలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్య వ్యక్తులకు కూడా చోటు కల్పిస్తున్నట్లు సమాచారం. ఇది షోను మరింత జనానికి దగ్గర చేసే అవకాశం కల్పిస్తుంది.
అధికారిక డేట్ త్వరలో – అభిమానుల్లో ఉత్కంఠ
ప్రస్తుతం ప్రోమోతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. షో ప్రారంభ తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. మారిన ఫార్మాట్, కొత్త కాంటెస్టెంట్స్, కొత్త కాన్సెప్ట్తో ఈసారి బిగ్బాస్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని నిర్వాహకులు ధీమాగా చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: