హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తన వెబ్ సిరీస్ దూత రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో, పోస్ట్ చేసారు. సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని తన వెబ్ సిరీస్ ‘దూత’ నిరూపించిందని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) అన్నారు.“ఒక యాక్టర్ గా సృజనాత్మకంగా కథను ఎంపిక చేసుకుని, నిజాయతీగా పని చేసి, ఉత్తమ ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సిరీస్ ‘దూత’. ఆడియన్స్ దాని నుంచి ఎనర్జీ పొంది, తిరిగి నటులకు అదే ఎనర్జీని అందిస్తారు.
Read Also: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే?
సీజన్-2 ఎప్పుడు
‘దూత’ సిరీస్ కి రెండేళ్లు పూర్తయ్యాయి. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని నాగ చైతేన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దూత సిరీస్లోని తన స్టిల్ ను షేర్ చేశారు. అయితే సీజన్-2 ఎప్పుడు అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో వచ్చిన దూతలో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో చైతన్య మెప్పించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: