తెలుగు సినిమా రంగానికి చెందిన సీనియర్ నటుడు, మురళీమోహన్ (Murali Mohan) ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవార్డుల ప్రకటనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హైదరాబాద్లో గద్దర్ అవార్డు (Gaddar Awards)ల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి అవార్డుల వ్యవస్థపై సమగ్ర దృష్టితో కూడిన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల గుర్తింపు అవసరమే
తెలుగు సినిమా రంగం అనేది కలిసికట్టుగా ఎదగాల్సిన రంగమని, అది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితమవ్వకూడదని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని, వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఒకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి.
ఒక ఏటా ఒక రాష్ట్రం అవార్డులు ప్రకటించాలని సూచన
ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అని ఆయన సూచించారు. పరిశ్రమ మొత్తానికి సమిష్టిగా గుర్తింపు లభిస్తుంది. ఈ విధానాన్ని అమలు చేస్తే రాజకీయ స్థాయిలో కూడా సినిమాకు మరింత గౌరవం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త ప్రభావం
తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు’ అని వివరించారు.
ప్రభుత్వాల పై బాధ్యత
ఈ సందర్భంలో మురళీమోహన్ సూచించిన విధంగా తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. మురళీమోహన్ సూచనపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
Read also: Kannappa: ‘కన్నప్ప’ సినిమాపై మంచు విష్ణు కౌంట్డౌన్ పోస్ట్