బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం 3’ సినిమా (Movie) ప్రారంభమయింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్(Prakash Raj) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అని తెలిపారు.
Read Also: Sreeleela: మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్

చిత్రం నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా
మరోవైపు ఈ సినిమా (Movie) నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నారు. ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే, ప్రకాశ్ రాజ్ తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో తాను ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ చిత్ర నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ స్పందిస్తూ అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్ నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. అక్షయ్ ఖన్నా పోషించిన తరహా పాత్రనే జైదీప్ చేస్తారని తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: