జాన్వీ కపూర్ బాలీవుడ్లో అడుగుపెట్టి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా, ఆమె కెరీర్లో పెద్ద విజయాలు అంతగా రాలేదు. కొన్ని మోస్తరు సక్సెస్లు మాత్రమే సాధించి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, తన తల్లి శ్రీదేవి కలలుగన్నట్టు, దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్లో ఒక ఘన విజయాన్ని అందుకోవాలని జాన్వీ ఆశపడుతోంది.
‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ
తెలుగు సినిమా రంగంలో ప్రవేశించడానికి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా కథలు విన్నప్పటికీ, చివరకు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ సినిమా భారీ అంచనాలు పెంచుకున్నప్పటికీ, ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. దీనితో జాన్వీ కొంత నిరుత్సాహానికి గురైనట్టుగా సమాచారం.

‘పెద్ది’లో కొత్త ఆశలు
‘దేవర’ (Devara) తర్వాత జాన్వీకి లక్కీగా మరో భారీ అవకాశం వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే సంవత్సరం మార్చిలో విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంతో హిట్ ఖాయం చేసుకోవాలని జాన్వీ పట్టుదలగా ఉంది.
RRR సమయంలో వచ్చిన ఊహాగానాలు
ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి ‘ఆర్ ఆర్ ఆర్’ చేస్తున్నప్పుడు, జాన్వీ కపూర్ ఆ సినిమాలో నటించే అవకాశం దొరుకుతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పుడు అభిమానులు కూడా ఆమెను ఈ ఇద్దరు స్టార్ హీరోల సరసన చూడాలని ఆశపడ్డారు. ఆ అవకాశం నిజం కాలేకపోయినా, తరువాత జాన్వీ మొదటి రెండు తెలుగు సినిమాలను కూడా ఈ ఇద్దరు హీరోలతోనే ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. వచ్చే మార్చిలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాతో హిట్టు పట్టుకెళ్లాలనే పట్టుదలతో జాన్వీ ఉన్నట్టుగా సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read also: