అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ – టైటిల్, పాత్రపేరు చుట్టూ వివాదం
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మరియు కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం పెద్ద దుమారానికే దారి తీసింది. సినిమాకు ‘జానకి’ అనే పేరు పెట్టడం, అదే పేరుతో లైంగిక దాడికి గురైన మహిళ పాత్రను చూపించడం సెన్సార్ బోర్డుకు సముచితంగా అనిపించలేదని, అందుకే వారు సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని నిరాకరించినట్లు సమాచారం.
ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జానకి అనే ఓ మహిళ సాగించే న్యాయ పోరాటం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అయితే, సీతాదేవికి మరో పేరైన ‘జానకి’ (Janaki) అనే పేరును లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు (Sensor Board) అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ కూడా ధృవీకరించారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని ఆయన వెల్లడించారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరం – క్రియేటివ్ ఫ్రీడమ్పై ప్రశ్నలు
ఈ అంశంపై ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. సినిమాలో ‘జానకి’ (Janaki) అనే పేరును వాడకూడదని సెన్సార్ బోర్డు (Sensor Board) చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలిపిందని ఆయన అన్నారు. సినిమా టైటిల్తో పాటు, ప్రధాన పాత్ర పేరును కూడా మార్చాలని బోర్డు సూచించిందని ఉన్ని కృష్ణన్ వివరించారు. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టడం తగదని బోర్డు భావించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మరో మలయాళ సినిమా విషయంలోనూ ఇలాంటి సమస్యే తలెత్తిందని, అప్పుడు ‘జానకి’ అనే పేరును ‘జయంతి’గా మార్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందారని ఆయన గుర్తుచేశారు.
విడుదలకు ముందే చిక్కుల్లో చిత్రబృందం
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత ప్లాన్ చేసింది. “సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది” అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం, సామాజికంగా ప్రాధాన్యత కలిగిన అంశాన్ని సెన్సిటివ్గా చూపించనుంది. ఇందులో సురేశ్ గోపి న్యాయవాది పాత్రలో కనిపించనుండగా, అనుపమ ప్రధాన పాత్రగా మెరవనున్నారు. అయితే టైటిల్, పాత్ర పేరులపై మార్పులు లేకపోతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ నారాయణ్, నిర్మాతలు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
Read also: Peddi: ఉత్కంఠ రేపుతున్న చరణ్ ‘పెద్ది’ సినిమా