Allu Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 19వ తేదీ నుంచి రెండు భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
Read Also: Adulterated Food Hyderabad:హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

మార్చి 19 నుంచి సినిమా సందడి
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్లో తొలి ప్రదర్శనలుగా రెండు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలను ఈ నెల 19 నుంచి ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు, జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. ప్రొజెక్షన్ సిస్టమ్స్, సౌండ్ సెటప్, ఇతర సౌకర్యాలను పరిశీలించి, పబ్లిక్ ఓపెనింగ్కు అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: