Nandamuri TarakaRatna: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మూడో వర్ధంతి నేడు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా 2023 ఫిబ్రవరి 18న కుప్పానికి వచ్చిన ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ప్రాణాలను కాపాడలేకపోయారు.
Read Also:Bollywood Actor: సిద్ధార్థ్ మల్హోత్రాకి పితృవియోగం

తారకరత్నను గుర్తు చేసుకున్న విజయసాయిరెడ్డి
ఆ సమయంలో ఆయనకు దగ్గరి బంధువైన అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను ఓదార్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్న మూడో వర్ధంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. తారకరత్న చాలా త్వరగా మన మధ్య నుంచి వెళ్లిపోయారని, ఆయన ఆప్యాయత, వినయం, అంకితభావం అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయని గుర్తు చేశారు. ఆయన మరణం కలిగించిన షాక్, అభిమానుల హృదయాల్లో ఏర్పడిన ఖాళీ ఇప్పటికీ గుర్తుందని పేర్కొన్నారు. తారకరత్నను ఎప్పటికీ మిస్ అవుతామని, ప్రేమగా గుర్తుంచుకుంటామని ట్వీట్లో తెలిపారు.
తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. ఆయన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణకు ఏకైక కుమారుడు. ఒకేసారి తొమ్మిది సినిమాలతో టాలీవుడ్లో అరుదైన ఎంట్రీ ఇచ్చి వరల్డ్ రికార్డు సృష్టించారు. కేవలం 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: