Nithya menen : జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి నిత్యా మీనన్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘కీయురి ప్రొడక్షన్స్’ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రకటిస్తూ సోషల్ మీడియాలో లోగో వీడియోను పంచుకున్నారు. సినిమా అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదని, మనుషుల మనసులను లోతుగా తాకే అనుభూతిని సృష్టించడం అని ఆమె తెలిపారు. నటిగా ప్రారంభించిన రోజునుంచి తన లక్ష్యం ఇదే అని, ఇప్పుడు నిర్మాతగా కూడా అదే దిశగా ముందుకు సాగుతానని చెప్పారు.
Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

ఈ సందర్భంగా తన తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సినిమా రూపం ఎలా ఉండబోతుందో చాలామందికి అర్థం కాలేదని, షూటింగ్ తర్వాత టీమ్తో కలిసి ఇరానీ చాయ్ తాగుతూ గడిపిన రోజుల్ని స్మరించుకున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు తన జీవితాన్ని మార్చాయని, చిన్న సినిమాలు చేస్తూ స్వేచ్ఛగా ఉండాలనుకున్న తన ప్రయాణాన్ని ఆ సినిమా పూర్తిగా మార్చేసిందని ఆమె తెలిపారు. ఇప్పుడు నిర్మాతగా అదే సృజనాత్మక ఉత్సాహంతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: