బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

Delhi budget: బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేసే దిశగా- ముఖ్యమంత్రి రేఖా గుప్తా సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంది. హామీలను అమలు చేయడానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేపట్టింది. ఇందులో మహిళల భద్రత, విద్య- వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందక్కడి కమలనాథుల సర్కార్.

బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా

తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ. రేఖా గుప్తా బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వయంగా ఆమెనే పర్యవేక్షిస్తోన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పలు అంశాల గురించి ప్రస్తావించారు. దీన్ని చారిత్రాత్మక బడ్జెట్‌గా అభివర్ణించారు. 10 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన అవినీతి, అసమర్థ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడారని రేఖా గుప్తా అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఆతిషి సారథ్యంలో ఆప్ పాలన భ్రష్టు పట్టిందని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఇష్టారీతిన సాగిందని విమర్శించారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు 2,144 కోట్ల రూపాయలను కేటాయించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 50,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు.
అర్హులైన ప్రతి మహిళకూ ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకానికి 5,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రేఖా గుప్తా తెలిపారు. దీనితోపాటు అన్ని చోట్ల కూడా అటల్ క్యాంటీన్లను నెలకొల్పబోతోన్నామని, దీనికోసం 100 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు చెప్పారు.

Related Posts
రన్యా రావు స్నేహితుడు అరెస్టు
డీఆర్‌ఐ దాడులు: రన్యా రావు స్నేహితుడి అరెస్టుతో కొత్త మలుపు

బంగారు అక్రమ రవాణా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో ప్రముఖ సినీ నటి రన్యా రావు పేరు తెరపైకి రావడంతో, మరింత ఆసక్తిని Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
delhi elections 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు Read more

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం
Another encounter in Jammu and Kashmir 1

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ Read more

GSTలో మార్పులు: ఏది చౌక, ఏది ఖరీదు?
GSTలో మార్పులు: ఏది చౌక, ఏది ఖరీదు?

GST కౌన్సిల్ యొక్క కీలక నిర్ణయాలు: ధరల మార్పుల వివరాలు GST కౌన్సిల్ పాప్‌కార్న్, ఉపయోగించిన కార్లు, ఫోర్టిఫైడ్ బియ్యం, కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌లు మరియు జరిమానాలు వంటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *