ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు

ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు

నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడ కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో నేడు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ట్రస్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది మరో మైలురాయి అని నారా భువనేశ్వరి అభివర్ణించారు.

Advertisements
ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు

సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పేదలకు, అభాగ్యులకు సాయం అందించే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ నేడు విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న వేళ నారా భువనేశ్వరిని, ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నానని తెలిపారు. “28 ఏళ్ల కిందట స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోట్లాది మందిని విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్… సేవా కార్యక్రమాలు చేసేవారికి స్ఫూర్తినిస్తోంది. తలసేమియా బాధిత పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలను విస్తరించే క్రమంలో జరిగిన నేటి నూతన భవన శంకుస్థాపన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ మెంట్ కు, సిబ్బందికి, దాతలకు అభినందనలు తెలుపుకుంటున్నాను” అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related Posts
అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు – మంత్రి నారాయణ
narayaan amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను Read more

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం
Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. Read more

వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ
RK Roja meet with YS Jagan

గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్ అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి Read more

YCP: కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైసీపీ కైవసం
YSRCP wins Kadapa district ZP chairman post

YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ Read more

×