Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త:

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులలో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు.

WhatsApp Image 2025 03 24 at 15.21.38 a96f0f59

ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి, వివరాలు సీఎం కి తెలియజేయాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే శాసనసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, వడదెబ్బ నివారణకు సంబందించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అంతకుముందు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్ట్ సూపెరింటెండెంటింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డిఈ డి.శ్రీనివాస్, సిఐ బాల్ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

Related Posts
telangana budget :తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకే ప్రాధాన్యత
తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకే ప్రాధాన్యత

తెలంగాణ బడ్జెట్ 2025-26 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండవ బడ్జెట్. భట్టి విక్రమార్క Read more

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..
A shock to Kejriwal before the Delhi elections

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు Read more

TG Budget : రాష్ట్ర బడ్జెట్‌ పేదల కష్టాలను తీర్చేలా లేదు : కేటీఆర్‌
State budget does not address the problems of the poor..KTR

TG Budget: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ బడ్జెట్‌ పై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌ తెలంగాణ Read more

మళ్లీ అధికారంలోకి వచ్చాక పెరిగిన వాటర్‌ బిల్లు మాఫీ చేస్తా: కేజ్రీవాల్
Kejriwal will waive the increased water bill after coming back to power

న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పెరిగిన నీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *