TDP Foundation Day.. Chandrababu, Lokesh pay tribute to NTR statue

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్‌ నివాళి

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా జరింది. ఈ వేడుకలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్‌, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేశ్‌ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంతవరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు.

Advertisements
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌

రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా..రికార్డులు బద్దలు కొట్టాలన్నా టీడీపీతోనే

మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ..రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.. మొదటి గెలుపు ఓ సంచలనం అని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారాయని అన్నారు. ఇప్పటికీ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయంటే అందు కారణం ఎన్టీఆరే అని కొనియాడారు. తెలుగోడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపింది అన్న ఎన్టీఆర్ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని ఎంతమంది పత్యర్థులు మీదపడినా పసుపు సైన్యం మాత్రం పట్టు విడవకుండా పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘటన మహానేత ఎన్టీఆరే అని దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపింది చంద్రబాబేనని ప్రశంసించారు. మనకు గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ తెలుసుంటూ చమత్కరించారు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్ర వేరని నారా లోకేశ్ అన్నారు.

Related Posts
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అక్రమాలకు ఇకపై తావుండదని, తప్పు చేసేవారు భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో Read more

Super Fast Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ నుండి విడిపోయిన భోగీలు
Super Fast Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ నుండి విడిపోయిన భోగీలు

శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది పలాస సమీపంలో బోగీలు విడిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం Read more

కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్
KLH Global Business School Announces Capacity Building Programme

హైదరాబాద్ : డిజిటల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్‌పై రెండు వారాల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ (సీబీపీ)ని ప్రారంభించినట్లు కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్, హైదరాబాద్ వెల్లడించింది. Read more

Mithun Reddy : మిథున్‌రెడ్డిని 8 గంటలపాటు విచారించిన సిట్‌
SIT interrogated Mithun Reddy for 8 hours

Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పై మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారుల విచారణ శనివారం(ఈరోజు) ముగిసింది. నేడు ఉదయం విజయవాడ సిట్‌ కార్యాలయానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×