మారిన ఆట రికార్డులు తారుమారు
న్యూఢిల్లీ: IPL18 సీజన్ రసవత్తరం సాగుతోంది. ఈ సీజన్లో ఏవో ఊహించని జట్లు అనూహ్య ప్రదర్శనలు కనబరుస్తున్నాయి. IPL ఇప్పటివరకు ఐదు సార్లు ట్రోఫీ నెగ్గిన టీమ్స్ ఇప్పుడు ఐపీఎల్ టేబుల్లో చివరి స్థానాల్లో ఉన్నాయని చూడవచ్చు. అయితే, తాజాగా జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ టాపర్స్ లిస్టులో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కొత్త ప్లేయర్స్ చేరారు.ఇక ఎక్కువ పరుగులు చేసిన జాబితా కూడా మారింది. ప్రస్తుతం, లక్నో ప్లేయర్ నికోలస్ ఫురాన్ 6 మ్యాచ్లలో 349 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 215.43, ఫలితంగా అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లో 87 రన్స్ చేసి నాటౌట్గా నిలిచి తన స్థిరమైన బ్యాటింగ్తో అద్భుతంగా కనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ 329 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. లక్నో ప్లేయర్ మికేస్మార్ట్ 265 పరుగులతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడ.

తాజా మ్యాచ్లో, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ, 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడంతో టాప్ స్కోరర్గా లిస్టులో చోటు సంపాదించాడు. ఇక ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ ముందున్నాడు. ఆరు మ్యాచ్లలో 12 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ టాప్ ప్లేయర్గా నిలిచాడు. 11 వికెట్లతో లక్నో ప్లేయర్ శార్థూల్ ఠాకూర్ రెండో స్థానంలో ఉన్నాడు, మరియు 10 వికెట్లతో గుజరాత్ ప్లేయర్ ప్రదీప్ కృష్ణ 3వ స్థానంలో ఉన్నాడు.ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో నికోలస్ ఫురాన్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం పూరన్ 31 సిక్సర్లు కొట్టాడు. రెండో స్థానంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు, అతను ఇప్పటి వరకు 20 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత 15 సిక్సర్లతో లక్నో ప్లేయర్ మికేస్మార్ట్ 3వ స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ 2025లో అత్యధిక బౌండరీలు కొట్టిన ప్లేయర్ల జాబితా చూస్తే, గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ 31 బౌండరీలతో టాప్లో ఉన్నాడు. 30 బౌండరీలతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ రెండో స్థానంలో ఉండగా, 28 బౌండరీలతో లక్నో ప్లేయర్ మిచెల్ మార్ట్ 3వ స్థానంలో ఉన్నాడు.
Read More : IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పై వేటు