45′ మూవీ టీజర్ లాంచ్ – శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బిశెట్టి కీలక పాత్రల్లో
హైదరాబాద్: భారీ అంచనాల మధ్య రూపొందిన పాన్ ఇండియా సినిమా “45” టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబడింది. ప్రముఖ Shivrajkumar నటులు , ఉపేంద్ర, రాజ్ బిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. శ్రీమతి ఉమా సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్పై రమేష్ రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ, “45వ సినిమా చేస్తున్నాను. స్క్రీన్ప్లే పరంగా కొత్తదనం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ఇది. రమేష్ రెడ్డి వంటి గొప్ప నిర్మాతలతో పనిచేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. అలాగే, దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ, “శివరాజ్ కుమార్గారు కథ వినగానే నువ్వే ఈ సినిమాకు డైరెక్షన్ చేయాలంటూ మోటివేట్ చేశారు. ఆయన మాటలు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆయన్ను చాలా కొత్తగా చూపించబోతున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా బాగాలేకపోయినా కూడా, ఎంతో డెడికేషన్తో నటించారు” అని అన్నారు.

శివరాజ్ కుమార్ పాత్ర ఈ చిత్రంలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుందని, ఆ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని దర్శకుడు చెప్పారు. ఉపేంద్రను కూడా ఇంట్లో క్యాజువల్గా చూసి అదే గెటప్ ఈ సినిమాలో వాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఉండబోతున్నాయని, అలాగే సోషల్ కాన్సెప్ట్తో కూడిన కథనంతో రూపొందిందని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి వివరించారు.ఈ చిత్రం కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఓ పాయింట్ మీద చాలా బలంగా ఉంటుంది. ఇలాంటి కథ ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదని చెప్పగలను” అని ఆయన చెప్పారు.ప్రేక్షకుల మద్దతుతో ‘45’ మూవీ పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. త్వరలో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమవుతుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.
Read More : IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పై స్పందించిన అక్షర్ పటేల్