[:en]కేజ్రివాల్ చేస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు[:]

కేజ్రివాల్ ఆరోపణలపై కేసు నమోదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య సాగిన హోరాహోరీ పోరు పోలింగ్ తర్వాత కూడా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తులు దూసుకున్న పార్టీలు, నేతలు ఇప్పుడు పోలింగ్ ముగిశాక కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగిస్తున్నారు. అంతే కాదు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలు ఓవైపు కౌంటింగ్ కు ముందు కలకలం రేపుతుండగా.. ఇప్పుడు వాటిపై కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడం మరింత హీట్ పెంచుతోంది.

1681137588 1373


ఢిల్లీలో పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక భాగం ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగిందని తేల్చేశాయి.వీటిని కేజ్రివాల్ పార్టీ ఆప్ తోసిపుచ్చింది. అయితే ఎందుకైనా మంచిదని అనుకున్నారో ఏమో తమ ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేజ్రివాల్ ఆరోపణలు మొదలుపెట్టారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి రూ.15 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై బీజేపీ ఫైర్ అయింది. ఈ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చించింది. అయినా కేజ్రివాల్ తగ్గలేదు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రంగంలోకి దిగారు. కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలపై విచారణ జరపాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేజ్రివాల్ ఆరోపణలు తీవ్రమైనవని, వీటిపై దర్యాప్తు ప్రారంభించాని ఢిల్లీ ఏసీబీ అధికారుల్ని ఆయన ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ బృందం ఇవాళ ఆయన సివిల్ లైన్స్ నివాసానికి చేరుకుంది. ఆప్ తన సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ కేజ్రివాల్ చేస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. దీంతో శనివారం ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కంటే ముందే అటు కేజ్రివాల్, ఇటు బీజేపీ ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రేపు ఏదైనా తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Related Posts
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి
A terrible road accident.. 10 devotees died

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా Read more

ఢిల్లీలో పేలుడు కలకలం
Delhi CRPF School Incident

ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ వద్ద భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి Read more

ఎంపీ సీట్లు పునర్విభజన పై చెన్నైలో సమావేశం
ఎంపీ సీట్లు పునర్విభజన పై చెన్నైలో సమావేశం

భారతదేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పై జరుగుతున్న చర్చలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభావం చూపించే అంశంగా మారాయి. ఈ నెల 22వ తేదీన, చెన్నైలో Read more

chahal and dhanashree : యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులు
యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు

ముగిసిన వివాహ బంధంభారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ,ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను మంజూరు చేసింది. Read more