టీమిండియా ప్రముఖ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయం పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి గాయం స్థితి పై అనిశ్చితి కొనసాగుతుంది. ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే సిరీస్లో మూడో వన్డేకు బుమ్రాను టీమ్ ఎంపిక చేసినప్పటికీ ఆ మ్యాచ్ లో అతడు ఆడే అవకాశాలు కొంతమేర అనుమానంగా మారాయి.ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన గాయంపై చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇటీవల స్కానింగ్ సహా అనేక వైద్య పరీక్షలు చేయించారు మొదటగా జనవరిలో బుమ్రా గాయంపై ఒక స్కానింగ్ జరిగింది. తాజాగా మరోసారి స్కానింగ్ నిర్వహించారు ఆ నివేదికలు వచ్చిన తర్వాత బుమ్రా యొక్క భవిష్యత్తు ప్రస్తావన స్పష్టమవుతుంది.

ఈ వైద్య నివేదికలను న్యూజిలాండ్కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రోవన్ స్కౌటెన్ పరిశీలించనున్నారు. ఈ పర్యవేక్షణతో బుమ్రా గాయంపై మరింత స్పష్టత రాబోతుంది ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇటువంటి గొప్ప టోర్నీలో బుమ్రా వంటి కీలకమైన పేసర్ లేకుండా టీమిండియా బరిలోకి దిగడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా గాయం సమస్యపై మరిన్ని వివరాలు అందగానే జట్టు భవిష్యత్ ప్రణాళికలు మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీ లో ఉంది.