15న ఫీజు పోరు దీక్షకు సిపిఎం సంపూర్ణ మద్దతు: జాన్ వెస్లీ
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ. 7,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు కలిసి మద్దతు కోరారు. ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ‘ఫీజు పోరు దీక్ష’కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. నిరుపేద విద్యార్థుల చదువులకు వెన్నెముకగా ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: TG Degree New Courses: బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

Telangana Education: Demand for Release of Fee Reimbursement Arrears
సర్టిఫికెట్లు అందక విద్యార్థుల ఆవేదన
ఫీజు బకాయిల సాకుతో విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపేయడం వల్ల వారు పై చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని జాన్ వెస్లీ విమర్శించారు. నిధుల విడుదల లేకపోవడంతో విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతుండటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల విద్య కోసం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి వెంటనే బకాయిలను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయాలి
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని, అప్పుడే వారికి నిజమైన లబ్ధి చేకూరుతుందని సిపిఎం నేతలు సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: