బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులకు మంత్రి సవిత పిలుపు
సచివాలయం : నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులకు రాష్ట్ర బిసి, ఇడబ్ల్యుఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురికావద్దని, మానసిక ప్రశాంతతో పరీక్షలు రాసి, అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలని పిలుపునిచ్చారు. 13,604 మంది బిసి హాస్టళ్ళు, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులు హాజరవుతున్నారని వారిలో బిసి హాస్టళ్ళ విద్యార్థులు 8,068 మంది, ఎంజెపి స్కూళ్ళ విద్యార్థులు 5,536 మంది ఉన్నారన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందిన్నారు.
Read also: Half day schools: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

Minister Savitha: Achieve Outstanding Results
ఉచిత బస్సు సౌకర్యం మరియు భద్రత
పరీక్షా కేంద్రాలకు హాల్ టిక్కెట్తో ముందుగాను చేరుకోవాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. గతేడాది ఎంజెపి స్కూళ్ళ ద్యార్థులు 10 పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ ఏడాది కూడా ఎంజెపి విద్యార్థులు, బిసి హాస్టళ్ళ విద్యార్థులు వందశాతం మేర ఉత్తీర్ణత శాతం సాధించి కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి ఆకాంక్షించారు. డిబిసిడబ్ల్యుఓలు, ఇతర సిబ్బంది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంటే ఉండాలని, పరీక్షలు అవ్వగానే వారిని తిరిగి హాస్టళ్ళకు, ఎంజెపి స్కూళ్ళకు క్షేమంగా తీసుకురావాలని మంత్రి సవిత ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: