हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP EAPCET: ఈఏపీసెట్‌ లో 15 వేలకు పైగా విద్యార్థులకు ప్రకటించని ర్యాంకులు

Sharanya
AP EAPCET: ఈఏపీసెట్‌ లో 15 వేలకు పైగా విద్యార్థులకు ప్రకటించని ర్యాంకులు

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌-2025 (AP EAPCET-2025) ఫలితాలు విడుదలైనప్పటికీ, అనూహ్యంగా దాదాపు 15 వేలమందికి పైగా విద్యార్థులకు ర్యాంకులు కేటాయించకపోవడం గమనార్హం. ఈ విషయం విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపుతోంది. అయితే అధికారికంగా ఉన్నత విద్యామండలి (APSCHE) మరియు ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు కొన్ని స్పష్టమైన వివరణలు ఇచ్చారు.

ఎందుకు కొన్ని ర్యాంకులు ప్రకటించలేదు?

ఇంటర్మీడియట్‌ మార్కులు అందుబాటులో లేకపోవడం వల్లే ర్యాంకులు కేటాయించలేదని అధికారులు తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళనకు గురికావొద్దని ఏపీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు భరోసా ఇచ్చారు. వారంతా 10+2లో సాధించిన మార్కులను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వివిధ రాష్ట్రాల అభ్యర్థులు తమ ఇంటర్‌ మార్కులను జూన్‌ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, వెయిటేజీ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని జూన్ 11న ఓ ప్రకటనలో తెలిపారు.

ఎవరికి అప్లోడ్ అవసరం లేదు?

మార్చి 2025లో ఇంటర్‌ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రెగ్యులర్‌ విద్యార్థుల్లో ర్యాంకులు రానివారంతా ఇంటర్ మార్కులను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తులో ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్లను సరిచూసుకొని కాకినాడలోని జేఎన్‌టీయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో వ్యక్తిగతంగా లేదా ఫోన్, మెయిల్‌ ఐడీ ద్వారా సంప్రదించాలని కోరారు.

ఏం చేయాలి?

ఈ విద్యార్థులు తమ ఇంటర్ మార్కులను జూన్ 15వ తేదీలోపు అధికారిక ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తరువాత వాటి వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.

  • వెబ్‌సైట్: [email protected]
  • ఆఖరి తేది: జూన్ 15, 2025

సంబంధిత హెల్ప్‌లైన్ వివరాలు:

రెగ్యులర్‌ ఇంటర్‌విద్యార్థులు కాకుండా ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్‌, ఎన్‌ఐఓఎస్‌, డిప్లమా, ఇతర బోర్డులకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు తమ మార్కులను ఏపీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు వస్తే 0884-2359599, 0884-2342499 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Read also: Krishnam Raju : కృష్ణంరాజులో పశ్చాత్తాపం లేదన్న పోలీసులు


Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి వేయాలని కర్ణాటక సీఎం లేఖ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870