సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది.

ఇళ్ల పట్టాలు రద్దు : ఆందోళనలో జనం

సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.

Pawan with TDP chief N Chandrababu Naidu HT 1673894884446

ఈ తరుణంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. అందుకు సంబంధించి చూపాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెబుతున్నారు. లేకుంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు. లబ్ధిదారులకు నియమాలు అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఇన్‌కం టాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఇళ్ల స్థలం రద్దు చేస్తారు కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఉంచి, మిగతా వారికి రద్దు చేస్తారు. చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే కులచివేతలను ప్రారంభించారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చివేయడంతో కాలనీ వాసులు అర్ధనాథాలు చేశారు.(ఎన్‌పీఐ) పథకం కింద లబ్ధిపొందిన వారెవరు? వారంతా నిజమైన పేదలేనా? లేక వైసీపీ కార్యకర్తలు ఇళ్ల పట్టాలు పొందారా? నిజమైన పేదలకే ఇళ్ల స్థలాలు మంజూరయితే ఇప్పటిదాకా 9 లక్షల మంది ఎందుకు పట్టాలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జగన్‌ సర్కారు 32 లక్షల మంది పేదలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామని గొప్పలు చెప్పగా, అందులో 9 లక్షల మంది పట్టాలే తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ 9 లక్షల మంది ఎవరు? పట్టాలు తీసుకున్నవారిలో అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అన్నది నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ కింద పున:పరిశీలన ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. 18 రకాల ప్రశ్నలు, వాటి అనుబంధ సమాచారంతో అసలైన లబ్ధిదారులు ఎవరో నిర్ధారించేందుకు మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది.

ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే, వారికీ రద్దు చేస్తారు. అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది. దీని ఆధారంగా అధికారులు లబ్ధిదారులను పరిశీలించనున్నారు. లబ్దిదారులు ఇచ్చే వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు. వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని కొన్ని ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.

Related Posts
బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్చి నాని సతీమణి ముందస్తు బెయిల్
perninaniwife

బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్చి నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై మచిలీపట్నం జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జయసుధ, Read more

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
AP Assembly Sessions Begin

వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి పార్టీ Read more

రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు
రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మార్పులు, రిజిస్ట్రేషన్ శాఖలో సమస్యలను Read more

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం
Appointment of YCP Regional

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి Read more