Cancellation of darshan of letters of recommendation on Ratha Saptami

రథసప్తమి వేళ సిఫారసు లేఖల దర్శనాలు రద్దు : టీటీడీ

తిరుమల: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి శుక్రవారం సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకుని ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించింది. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేది జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారని అన్నారు. రథసప్తమి సందర్భంగా సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

image

రథసప్తమి నాడు ఉదయం 6:44 గంటలకు సూర్యోదయ గడియలు రానున్నాయని.. ఈ గడియల్లో స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయని చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని రెండు లక్షల మంది వస్తారని అంచనా వేశామన్నారు. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామన్నారు. టైం స్లాట్ టికెట్స్‌ను ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు చేశామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

పార్కింగ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించామని వెల్లడించారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు వితరణ చేస్తామన్నారు. ఆలయ మాడ విధుల్లో చలవపందిళ్లు ఏర్పాటు చేశామని.. 8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతామన్నారు. తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

Related Posts
ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
CBN Gvt Schools

పాఠశాలలకు గుడ్ న్యూస్ ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో Read more

రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్
Rahul ji come to Telangana.youth is calling

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ Read more

బెంగళూరులో టాటా మోటార్స్
Tata Motors is strengthening sustainable urban transport in Bengaluru

BMTC నుండి 148 స్టార్‌బస్ ఎలక్ట్రిక్ బస్సుల అదనపు ఆర్డర్‌ను పొందుతుంది.. బెంగళూరు : టాటా మోటార్స్, భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ, బెంగళూరు Read more

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *