దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 120.21 పాయింట్లు తగ్గి 84,559.65 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 41.55 పాయింట్లు నష్టపోయి 25,818.55 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా నష్టాల బాటలోనే సాగాయి.
Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ల ధరలు?

Stock Market
మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి
నిఫ్టీ 25,900–26,000 స్థాయిని దాటే వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్షణంగా 25,700–25,750 స్థాయిలు కీలక మద్దతుగా ఉన్నాయని, అవి దిగువకు జారితే పతనం మరింత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, కమొడిటీ మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కోలుకుని 89.81 వద్ద ముగిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: