మార్కెట్లో వంట నూనెలు, వివిధ రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యుల బడ్జెట్పై భారంగా మారుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.150 నుంచి రూ.167 వరకు చేరింది. వేరుశనగ నూనె(PriceHike) లీటరు రూ.180కు పెరగగా, పామాయిల్ ప్యాకెట్ ధర రూ.120కు ఎగబాకింది.
Read Also: Gold Price Rate 03/02/26 : గోల్డ్ రేట్స్ షాక్, రికార్డు నుంచి భారీగా పతనం!

వేరుశనగ పలుకుల ధరకు షాక్
నూనెలతో పాటు వేరుశనగ పలుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వేరుశనగ పలుకుల ధర గతంలో రూ.140 ఉండగా, ప్రస్తుతం ఏకంగా రూ.200 వరకు చేరింది. దీంతో గృహ వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రాములు తగ్గించి ధర పెంచుతున్న కంపెనీలు
మరోవైపు కొన్ని నూనె తయారీ(PriceHike) కంపెనీలు వినియోగదారులకు తెలియకుండా కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. ధర పెంచకుండానే లీటరు (910 గ్రాములు) ప్యాక్ల స్థానంలో 850, 800 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ మోసానికి పాల్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: