Mukesh Ambani:దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

Read Time:  1 min
Mukesh Ambani
Mukesh Ambani
FONT SIZE
GET APP

భారత స్టాక్ మార్కెట్‌లో ఇప్పటివరకు లేని స్థాయిలో భారీ ఐపీఓ త్వరలో రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్ను 2026 సంవత్సరం తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు(Mukesh Ambani) తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది.

Read Also: Fuel Prices: ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

Mukesh Ambani
Mukesh Ambani: Is Reliance Jio going to be the largest IPO in the country?

ముకేష్ అంబానీ ప్రకటన తర్వాత ఊహాగానాలు

జియోను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నట్లు గత ఏడాది రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. ఆ ప్రకటన తర్వాత నుంచి జియో ఐపీఓపై అంచనాలు మరింత పెరిగాయి. దేశీయంగా అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగిన జియో, ఈ ఐపీఓతో కొత్త రికార్డులు సృష్టించనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జియో ఐపీఓ ద్వారా సంస్థ విలువ మరింత పెరగనుందని, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ముఖ్యమైన అవకాశంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.