GST Reduction-ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త విధానం ప్రకారం, కేవలం 5% మరియు 18% జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయి. దీనివల్ల టీవీలు, లగ్జరీ వస్తువులు మాత్రమే కాకుండా, చిన్న బిస్కెట్లు, చిప్స్, పేకెట్లు వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

తక్కువ ధర ఉత్పత్తులపై మార్పులు మరియు ఎఫ్ఎంసిజీ స్పందన
అయితే 5, 10, 20 రూపాయల చిప్స్, బిస్కెట్లు, నామ్కీన్, సబ్బులు, టూత్పేస్ట్ వంటి తక్కువ ధర ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయా అనే సందేహం ఉన్నది. ఎఫ్ఎంసిజీ కంపెనీలు(FMCG companies) వెల్లడించగా, ఈ ఉత్పత్తుల ధరలను తగ్గించడం కష్టమని తెలిపారు. ఎందుకంటే, వినియోగదారులు ఈ స్థిరమైన తక్కువ ధరలకు అలవాటు పడినవారే, ధరను తగ్గించడం వల్ల గందరగోళం, అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. దాంతో, కంపెనీలు ప్యాకెట్ పరిమాణాన్ని పెంచడం ద్వారా GST ప్రయోజనాలను వినియోగదారులకు అందజేస్తున్నాయి.
ప్యాకెట్ పరిమాణ పెంపు మరియు ప్రభుత్వ పర్యవేక్షణ
ఉదాహరణకు, రూ.20 బిస్కెట్ ప్యాక్ ధర స్థిరంగా ఉంచి, అందులోని ఉత్పత్తి పరిమాణాన్ని (Product size)పెంచుతున్నారు. ఈ మార్పు ద్వారా వినియోగదారులు ఎక్కువ విలువ పొందగలుగుతారు. అలాగే రోజువారీ ఉత్పత్తుల డిమాండ్ కూడా పెరుగుతుందని కంపెనీలు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా వినియోగదారులు పూర్తి ప్రయోజనం పొందేలా కంపెనీల పర్యవేక్షణలో ఉంది మరియు మార్గదర్శకాలు జారీ చేసింది.
కొత్త GST రేట్లు ఏ తేదీ నుంచి అమలులోకి వస్తాయి?
సెప్టెంబర్ 22 నుంచి కొత్త 5% మరియు 18% రేట్లు అమలులోకి వస్తాయి.
చిన్న ధర ఉత్పత్తులపై GST తగ్గింపు ప్రభావం ఏమిటి?
5, 10, 20 రూపాయల బిస్కెట్లు, చిప్స్, సబ్బులు, టూత్పేస్ట్ వంటి ఉత్పత్తుల ధరలను తగ్గించడం కష్టమని కంపెనీలు పేర్కొన్నాయి; కానీ ప్యాకెట్ పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్రయోజనం వినియోగదారులకు అందజేయబడుతుంది.
Read hindi News: Hindi.vaartha.com
Read also: