ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తమ కస్టమర్ల కోసం రెండు కొత్త డిజిటల్ సేవలు ప్రారంభించింది. ఈ-సిమ్ సదుపాయం, యాంటీ-స్పామ్ టూల్స్ (E-SIM facility, anti-spam tools) తో టెక్నాలజీని మరో మెట్టు ఎక్కించింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేయడమే సంస్థ లక్ష్యం.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ-సిమ్ సేవతో ఇక సిమ్ కార్డు చుట్టూ తిరుగటానికి ఫినిష్. ఆధునిక స్మార్ట్ఫోన్లకు సరిగ్గా సరిపోయే ఈ డిజిటల్ సిమ్, ఫోన్లోనే యాక్టివేట్ చేయొచ్చు.ఫోన్ పోయినా, సిమ్ డ్యామేజ్ అయినా, ఇబ్బంది ఉండదు. అవసరమైతే తిరిగి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4G నెట్వర్క్పై మొదలు… 5Gకు సిద్ధం
ఈ సేవలు ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్లో పనిచేస్తున్నాయి. సంస్థ మాట ప్రకారం, రాబోయే 5G టెక్నాలజీకి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి.
ఈ-సిమ్ పొందాలనుకునే వారు బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లేదా సమీప కస్టమర్ కేర్ కేంద్రం ద్వారా నమోదు చేసుకోవచ్చు.రోజూ ఆగడాలు చేస్తున్న స్పామ్ కాల్స్, ఫేక్ మెసేజ్లపై బీఎస్ఎన్ఎల్ సమర్థంగా స్పందించింది.కస్టమర్ల డిజిటల్ భద్రత కోసం ఏఐ ఆధారిత యాంటీ-స్పామ్ టూల్స్ను ప్రవేశపెట్టింది. ఇవి ఆటోమేటిక్గా స్పామ్ను గుర్తించి, బ్లాక్ చేస్తాయి.ఈ టూల్స్ వల్ల సైబర్ మోసాల నుంచి రక్షణ లభించనుంది. వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా వీటిని యాక్టివేట్ చేసుకోవచ్చు.

డిజిటల్ భద్రతపై బీఎస్ఎన్ఎల్ దృష్టి
నేటి డిజిటల్ యుగంలో డేటా భద్రత చాలా కీలకం. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల రక్షణకు కృషి చేస్తోంది.ఈ-సిమ్ టెక్నాలజీ వల్ల కనెక్టివిటీ సులభతరం అవుతుంది. యాంటీ-స్పామ్ టూల్స్ వల్ల సైబర్ మోసాల బారిన పడకుండా ఉంటారు, అని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.త్వరలో ఈ సేవలను ఇతర పట్టణాల వరకు విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ఈ రెండింటినీ ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తోంది.ఈ-సిమ్ టెక్నాలజీతో మొబైల్ వాడకం మరింత హ్యాసిల్-ఫ్రీగా మారనుంది.యాంటీ-స్పామ్ టూల్స్తో వ్యక్తిగత సమాచారం బాగానే సురక్షితంగా ఉంటుంది.
వినియోగదారుల నుంచి మంచి స్పందన
ఈ కొత్త సేవలపై వినియోగదారులు ఇప్పటికే పాజిటివ్గా స్పందిస్తున్నారు.ఇప్పటి వరకు స్పామ్ మెసేజ్లు విసిగించేవి. ఇప్పుడు సేఫ్గా ఫోన్ వాడొచ్చు, అంటున్నారు కస్టమర్లు.ఈ-సిమ్ వల్ల నా ఫోన్ మార్చినప్పుడు సిమ్ పెట్టే కష్టమే లేకుండా పోయింది, అన్నారొక వినియోగదారు.టెక్నాలజీ వేగంగా మారుతోంది. బీఎస్ఎన్ఎల్ కూడా ఆ మార్పుకు అడుగులు వేస్తోంది.ఈ-సిమ్, యాంటీ-స్పామ్ టూల్స్తో సంస్థ వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా నిలబెట్టుకుంది.
Read Also :