हिन्दी | Epaper

కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకుడు

pragathi doma
కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకుడు

చందానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుక్క తరిమినందున, ప్రాణ భయంతో మూడో అంతస్తు హోటల్‌ నుంచి దూకిన యువకుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మరణించాడు.

వివరాలలోకి వెళితే, తెనాలికి చెందిన ఉదయ్‌ (23) అనే యువకుడు హైదరాబాద్‌ ​ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలసి చందానగర్‌లోని ఓ హోటల్‌ కి పుట్టిన రోజు పార్టీ కోసం వెళ్ళాడు .హోటల్‌ లో నిలిచి ఉన్న సమయంలో హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఆ యువకుల వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఉదయ్‌ హోటల్ మూడో అంతస్తు నుంచి దూకాడు.

దూకడం వల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు ఉదయ్​ను ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది. కుక్కల బెడదపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కుక్కల సమస్యపై నగరంలో మరింత దృష్టిని కేంద్రీకరిస్తోంది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870