हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Kaman Bridge: భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

Vanipushpa
Kaman Bridge: భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ వంతెనను 6 ఏళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం మూసివేసిన ఈ కమాన్ వంతెనను.. తాజాగా శనివారం అధికారులు తెరిచారు. భారత్-పాక్ సరిహద్దుల్లో.. రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం. జీలం నదిలో దూకి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలను తిరిగి బయటికి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు. ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతా చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
ఈనెల 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు, యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం ధాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతీ, యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది.
యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం
అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికితీసే లోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-పీఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది. అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు సహకరించుకోవడం గమనార్హం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870