టాలీవుడ్ సెన్సేషనల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై సోషల్ మీడియాలో మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ రేపే (ఫిబ్రవరి 2న) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని చారిత్రాత్మక ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ వీరి వివాహ వేదిక కానుందని, అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇద్దరు యువతులు చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
HYD : హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
గత ఏడాది చివరలోనే విజయ్, రష్మికలు అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్తలను వారు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ “సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి తప్పకుండా చెబుతాను” అని అర్థవంతమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఉదయ్పూర్ ప్యాలెస్లో జరుగుతున్న హడావుడి చూస్తుంటే, బాలీవుడ్ సెలబ్రిటీల తరహాలో వీరిద్దరూ కూడా అత్యంత రహస్యంగా, రాయల్ వెడ్డింగ్కు ప్లాన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటి కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే, ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ లేదా రష్మిక టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం లేదా మరేదైనా యాడ్ షూట్ కోసం ఉదయ్పూర్లో ఏర్పాట్లు చేస్తున్నారా? లేక నిజంగానే ఏడడుగులు వేయబోతున్నారా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం, ఇది టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com